ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్లో అనవసర ఖర్చులను తగ్గించడంలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎర్ర తివాచీల వినియోగాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని హెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. వాటిని దౌత్యపరమైన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులకు ఎర్ర తివాచీలను వినియోగించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.