పంచె కట్టుకుని
క్రికెట్ ఆడారు ప్లేయర్లు. మ్యాచ్కు తగ్గట్టు కామెంటరీ సైతం సంస్కృతంలో చెప్పటం విశేషం. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన మహర్షి మైత్రి మ్యాచ్ టోర్నమెంట్ ఈ వినూత్న పోటీలు నిర్వహించింది. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పోటీలు నిర్వహిస్తున్నామని 'సంస్కృతి బచావో మంచ్' తెలిపింది. 12 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టును అయోధ్య రామమందిర దర్శనానికి ఉచితంగా తీసుకెళ్లనున్నారు.