టీ20 వరల్డ్ కప్-2024 ట్రోఫీని గెలుపొందిన క్రమంలో గోల్డ్ మెడల్తో దిగిన ఫొటోను టీమ్ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 'ఈ మెడల్ మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది' అని చెప్పుకొచ్చారు. అయితే, ఇలాంటి మెడల్ తమ దగ్గర కూడా ఉందని అక్షర్ పటేల్తో పాటు మహ్మద్ సిరాజ్ కామెంట్స్ చేశారు. వీరంతా ఒకే హోటల్లో ఉండి ఇలా చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.