వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ నిధులు ఎక్కడ నుంచి దోచుకున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్ర లెక్కలు ఆ విధంగా ఉన్నాయన్నారు. తాను నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ మరింత ఘోరంగా ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలకోట్ల రూపాయలు ఏ అకౌంట్లో నుంచి తీసుకున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.