ఆర్బీఐ ఆంక్షల కారణంగా వేల కోట్ల నష్టాలు చూస్తున్న పేటీఎం తాజాగా ఎస్బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్, కార్డు మెషిన్ల సేవలు యధాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తన నోడల్ అకౌంట్ను ఎస్బీఐకి బదిలీ చేసిన తర్వాత ఎస్క్రో అకౌంట్ ద్వారా మార్చామని, దీనివల్ల మునుపటిలాగానే తమ వ్యాపార లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది.