తొక్కిసలాట ఘటనపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్!

79చూసినవారు
తొక్కిసలాట ఘటనపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్!
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో నిన్న జరిగిన తొక్కిసలాటలో దాదాపు 120 మంది మరణించారు. కాగా సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజ్ఞాతంలోకి వెళ్లిన భోలేబాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సత్సంగ్ ముఖ్య సేవాదార్ దేవప్రకాశ్, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ తొక్కిసలాట ఘటనపై అలహాబాద్ హైకోర్టులో న్యాయవాది పిటిషన్ వేశారు. ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్