నల్లమల్ల అడవుల్లో 154 ఏళ్ల తర్వాత అడవిదున్న ప్రత్యక్షమైంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్లో అడవిదున్న కెమెరా ట్రాప్లో కనిపించింది. ఇది చివరిసారిగా 1870లో కనిపించినట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. వెలుగోడు రేంజ్లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి ఈ దున్నను గుర్తించామని, అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు.