ఎన్నికల ఫలితాల సందర్భంగా జూన్ 4న స్టాక్ మార్కెట్సూచీలు కుప్పకూలడంపై సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. అదానీ హిండెన్బర్గ్ కేసు రిట్ పిటిషన్కు అనుబంధంగా ఈ పిటిషన్ ఫైల్నమోదు అయింది. ఆ స్థాయిలో మార్కెట్లు క్రాష్ కావడంపై విచారణ జరిపి సెబీ, కేంద్రం నివేదికలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అదానీ-హిండెన్బర్గ్ వివాదంపైన కూడా సెబీ తన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సమర్పించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.