వ్యూహాత్మకంగా ఇరాన్లో చాబహార్, మయన్మార్లో సిట్వే పోర్టులను నిర్మించిన భారత్ ఇప్పుడు మరోసారి చైనాను దెబ్బకొట్టాలని భావిస్తోంది. బంగ్లాదేశ్లోని మోంగ్లా పోర్టులో కొత్త టెర్మినల్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. చైనా సైతం ఈ పోర్టు నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ భారత్ ఇందులో సక్సెస్ అయితే విదేశాల్లోని తమ ప్రమేయాన్ని విస్తరించాలన్న చైనా వ్యూహాలకు చెక్ పడినట్లు అవుతుంది.