ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(88) శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్సిటీలోని నివాసంలో ఉంచారు. సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా ఆయన్ను చూసి.. కన్నీరు పెట్టుకున్నారు. మరికొందరు ప్రముఖులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.