గర్భిణీ మృతి.. చితిలో సర్జికల్ బ్లేడ్ కలకలం (వీడియో)

75చూసినవారు
యూపీలోని మీరట్ ఓ మహిళ మృతి వివాదాస్పదమైంది. మవానాలోని జేకే ఆస్పత్రికి నవనీత్ అనే మహిళను డెలివరీ కోసం తీసుకొచ్చారు. డెలివరీ తర్వాత ఆ మహిళ మృతి చెందింది. దహన సంస్కారాల అనంతరం కుటుంబ సభ్యులు చితి నుంచి ఎముకలను సేకరిస్తున్న క్రమంలో బూడిదలో సర్జికల్ బ్లేడ్ కనిపించింది. ఆపరేషన్‌లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి బ్లేడ్‌ను కడుపులో వదిలేయడంవల్లే నవనీత్ మృతి చెందిందని కుటుంబీకులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. దీంతో ఆసుపత్రి లైసెన్సు రద్దు చేసి, విచారణ చేపట్టారు

సంబంధిత పోస్ట్