మహిళపై దుర్భాషలాడిన పిన్నెల్లి

36247చూసినవారు
రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకు పడదోసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యేను ఓ మహిళ నిలదీశారు. ఈ క్రమంలో పిన్నెల్లి ఆమెపై దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్