ఢిల్లీలో ఏర్పడిన నీటి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో నీళ్లు విడుదల చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ సర్కార్ కోరింది. యమునా నదికి అదనపు నీటిని విడుదల చేయాలని కోరినట్టు మంత్రి అతిషి తెలిపారు. రాజధానిలో రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోందని వెల్లడించారు.