AI సమ్మిట్లో భాగంగా రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రాన్స్లోని మార్సెయిల్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో కలిసి నూతన కాన్సులేట్ను ప్రారంభించారు. అంతకు ముందు మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత అమరవీరులకు మోదీ నివాళులు అర్పించారు. భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా గతంలో ఫ్రాన్స్ ప్రభుత్వం మార్సెయిల్ ప్రాంతంలో యుద్ధ స్మారకం నిర్మించింది.