ICC U19 మహిళల వరల్డ్ కప్లో విజయం సాధించిన టీమ్ ఇండియా జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘మన నారీ శక్తి పట్ల ఎంతో గర్వంగా ఉంది. ఈ విజయం మన అద్భుతమైన జట్టు కృషితో పాటు దృఢ సంకల్పం, ధైర్య సాహసాల ఫలితం. ఇది రాబోయే అనేక మంది అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుంది. జట్టు భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు’ అని మోడీ ట్విట్టర్ ఎక్స్లో ట్వీట్ చేశారు.