పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో
టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం’’ అని తెలిపారు.