ఏపీ ఫైబర్ నెట్‌ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల భద్రత

54చూసినవారు
ఏపీ ఫైబర్ నెట్‌ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల భద్రత
విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్‌ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కీలక దస్త్రాలను కొందరు ధ్వంసం చేస్తారని నిఘా వర్గాల సమాచారం రావడంతో భద్రతను పెంచారు. ముఖ్యమైన దస్త్రాలు, డేటా ఎవరూ బయటకు తీసుకెళ్లకుండా కాపలా కాస్తున్నారు. మూడు, నాలుగు అంతస్తుల్లో 24 గంటల పాటు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయాన్ని సౌత్ జోన్ ఏసీపీ రతన్ రాజు, సైబర్ క్రైమ్ ఏసీపీ తేజేశ్వరరావు సందర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్