తెలంగాణలో సంచలనం రేపిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్, హార్డ్డిస్క్ల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ఆయనను 7రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. నేటినుంచి 23వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ ఏడు రోజుల పాటు ప్రణీత్ రావును సిట్ పోలీసులు విచారించనున్నారు. దీంతో ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు.