తలపై బూటుకాలుతో తొక్కి హింసించిన పోలీసులు (Video)

81320చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ వ్యక్తిని ఇద్దరు హోంగార్డులు దారుణంగా హింసించారు. నవాబ్‌గంజ్ పీఎస్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వీరేంద్ర తన భూమి పనిపై నిన్న స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ హోంగార్డు వాచ్‌మన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో వాగ్వాదం మొదలై.. హోంగార్డులు వాచ్‌మన్‌ను కిందపడేసి తలపై బుటుకాలుతో తొక్కి హింసించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్