సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ ఇవాళ సాయంత్రం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. మొత్తం 6 రాష్ట్రాలు, 2 యూటీల్లోని 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇప్పటివరకు 6 విడతల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. కాగా జూన్ 1న ఏడో విడతలో 8 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. జూన్ 4న లోక్సభ, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.