టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లాలో వైసీపీ బహిరంగ సభ జరిగింది. ఈ క్రమంలో సీఎం జగన్ కు సాగునీటి విడుదలపై వినతిపత్రం ఇచ్చేందుకు అఖిలప్రియ వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అఖిలప్రియను, టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.