ఢిల్లీ విమానాశ్రయంలో పవర్ కట్.. ప్రయాణికుల అవస్థలు(వీడియో)

77చూసినవారు
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అరగంట నుంచి విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో బోర్డింగ్, చెక్ ఇన్ సేవలకు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మూడో టెర్మినల్ వద్ద విద్యుత్ లేక ప్రయాణికులు బోర్డింగ్ కు అవస్థలు పడ్డారు. దీనిపై సిబ్బంది సైతం స్పందించట్లేదని, సీనియర్ సిటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్