నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద, హంపి

63చూసినవారు
నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద, హంపి
భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, కోనేరు హంపి, వైశాలి నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీపడనున్నారు. ఈ టోర్నీ ఈనెల 27 నుంచి జూన్ 7 వరకు జరుగుతుంది. నార్వే చెస్ పురుషుల విభాగంలో పోటీపడనున్న ఏకైక భారత ఆటగాడు ప్రజ్ఞానందే. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్, ప్రపంచ నంబర్ 3 నకముర, ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ కూడా ఈ టోర్నమెంట్లో పోటీపడనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్