ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పెసర, మినుము పంటల్లో రసం పీల్చే పురుగుల ఉత్పత్తి పెరిగి పల్లాకు తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది. దీని నివారణకు ముందు జాగ్రత్తగా ఎకరానికి 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. ఒకవేళ రసంపీల్చే పురుగుల ఉద్ధృతి మరీ ఎక్కువగా ఉంటే 2 మి.లీ. ఫిప్రోనిల్ (లేదా) 1.5 గ్రా ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.