తమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రేమకు తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. పూజిత, ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే యువతి తల్లిదండ్రులు కూతురు మెడలో నుంచి తాళిబొట్టును తెంపేసి బలవంతంగా ఆమెను తీసుకెళ్లారు. దీంతో పూజిత కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.