కర్ణాటకలో ప్రస్తుతం నీటి కొరత ఉన్నది. దీంతో అక్కడ కలరా వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వాటర్ టెస్టింగ్ చేయాలని సీఎం సిద్ధరామయ్య జిల్లా అధికారులను ఆదేశించారు. కలుషిత నీటి వల్ల అతిసార, ఇతర రకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి. మైసూరు జిల్లాలో తాజాగా ఓ వ్యక్తి కలుషిత నీటిని సేవించడం వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడు.