ఉచిత ఇసుక అని ధరలు పెంచుతున్నారు: మాజీ సీఎం జగన్‌

79చూసినవారు
ఉచిత ఇసుక అని ధరలు పెంచుతున్నారు: మాజీ సీఎం జగన్‌
AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌ శుక్రవారం మాట్లాడారు. ఇసుక తీసే కాంట్రాక్టులను అధికార పార్టీ వారికే కట్టబెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా ఇసుక విధానం తీసుకొచ్చామన్నారు. దోపిడీకి అవకాశం లేని విధంగా చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్