పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.పదేళ్లలో 25 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. పదేళ్లలో భారత్ ఖ్యాతి ఎంతో పెరిగిందని మోడీ అన్నారు. అయితే విపక్షాల నిరసనల మధ్యే ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. అవినీతి ఏ మాత్రం సహించకుండా పరిపాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.