బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సమావేశంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి చికిత్స కోసం భారత్ రావాలనుకునే వారికి ఇకపై ఈ-వీసా సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనికోసం రంగ్పుర్లో కొత్తగా అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు మోదీ తెలిపారు. బంగ్లాదేశ్ప్రజలు సులువుగా భారత్కు వచ్చి చికిత్స పొందే వీలుంటుందని చెప్పారు. ఇరు దేశాల సంబంధాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.