40 సెకన్లలో చోరీ.. 24 గంటల్లో అరెస్ట్
By Sai shivani 73చూసినవారుTG: బంగారు ఆభరణాల దుకాణ యజమానిని కత్తితో పొడిచి పట్టపగలే దోపిడీకి యత్నించిన ఘటన మేడ్చల్లో కలకలం సృష్టించింది. ఈ కేసులో నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేసినట్టు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. నిందితుల జాడ కోసం 200 సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. ఇటీవల చాదర్ఘాట్లో జరిగిన చోరీ కేసులో వీళ్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి నిందితులు నజీం, సోహైల్ను అరెస్ట్ చేసినట్లు సీపీ వివరించారు.