మహిళపై కర్రతో దాడి.. వీడియో వైరల్

59చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. అందరూ చూస్తుండగానే కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా మోదీ 3.0 కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా నియమితులైన సావిత్రి ఠాకూర్‌ స్వగ్రామంలో ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్