లైంగిక దాడి ప్రతిఘటించిందని ఆరేండ్ల బాలికను హత్య చేసిన ప్రిన్సిపాల్‌

84చూసినవారు
లైంగిక దాడి ప్రతిఘటించిందని ఆరేండ్ల బాలికను హత్య చేసిన ప్రిన్సిపాల్‌
గుజరాత్‌లోని దహోడ్‌ జిల్లాలో దారుణం జరిగింది. సింగ్‌వాడ్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్‌ గోవింద్‌ నాట్‌ అదే స్కూలుకు చెందిన ఓ బాలిక(6) గొంతు నులిమి హత్య చేశాడు. గురువారం సదరు ప్రిన్సిపాల్ కారులో పాఠశాలకు వస్తుండగా దారిలో బాలికను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. ఆవేశంలో గోవింద్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రిన్సిపాల్‌ను అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్