లారీని ఢీకొని ప్రైవేట్ బస్సు బోల్తా.. ఒకరు మృతి

51చూసినవారు
లారీని ఢీకొని ప్రైవేట్ బస్సు బోల్తా.. ఒకరు మృతి
కామారెడ్డి శివారు 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఢీకొని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 28 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.

సంబంధిత పోస్ట్