బంగ్లాపై గెలిచి.. సెమీస్‌కు చేరిన అఫ్గాన్‌

84చూసినవారు
బంగ్లాపై గెలిచి.. సెమీస్‌కు చేరిన అఫ్గాన్‌
టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ సంచలనం సృష్టించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన సూపర్‌ 8 మ్యాచ్లో బంగ్లాపై విజయం సాధించింది. దీంతో నేరుగా గ్రూప్‌ 1 నుంచి సెమీస్‌ చేరింది. ఇప్పటికే ఈ గ్రూప్‌ నుంచి భారత్‌ నాకౌట్‌కు చేరిన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల 27న జరగనున్న తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్, రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది.

సంబంధిత పోస్ట్