ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంకాగాంధీ ఫైర్

81చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంకాగాంధీ ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధనబలం ఉపయోగించి పడగొట్టేందుకు ప్రధాని అన్ని విధాలా ప్రయత్నించారని ఆరోపించారు. దేశంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ఉందన్నారు. ధనబలంతో సహా అన్నింటినీ వాడుకుంటున్నారని చెప్పారు. మతం పేరుతో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్