బీజేపీపై ప్రియాంక గాంధీ పైర్

72చూసినవారు
బీజేపీపై ప్రియాంక గాంధీ పైర్
అవినీతితో దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ప్రధాని మోదీ నేతృత్యంలోని ఎన్డీఏ సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ ఫైర్ అయ్యారు. పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. బీజేపీ హయాంలో పేపర్ లీకేజీలు జాతీయ సమస్యగా మారాయని ధ్వజమెత్తారు. పేపర్ లీకుల వల్ల లక్షలాది మంది యువత భవిష్యత్ నాశనం అయిందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో దేశంలో 43 రిక్రూట్‌మెంట్ పరీక్షల పేపర్లు లీకయ్యాయన్నారు.

సంబంధిత పోస్ట్