ఒలింపిక్స్ గేమ్స్కు తొలిసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2036 కోసం దాఖలు చేసే బిడ్ విజయవంతం కావాలంటే ఏం చేయాలనే అంశాలపై మిషన్ ఒలింపిక్స్ సెల్ క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఓ రిపోర్టును అందించింది. అలాగే కొత్తగా యోగా, చెస్, టీ20 క్రికెట్, కబడ్డీ, స్క్వాష్, ఖోఖో క్రీడలను ఒలింపిక్స్లో ప్రవేశపెట్టాలని సూచించింది. దీనివల్ల భారత్కు పతకాల సంఖ్య పెరుగుతుందని తెలిపింది.