డాక్టర్లు అవుదామని ఆశపడిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. విజయవాడలోని లెనిన్ కూడలిలో షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు. భాజపా ప్రభుత్వాలు అధికారంలో ఉన్న బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే పేపర్ లీక్ అయిందన్నారు. ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.