రక్తం ప్రాణాన్ని నిలబెడుతుందని, దవాఖానలు, బ్లడ్ బ్యాంకులు రక్తానికి సంబంధించి కేవలం ప్రాసెసింగ్ ఫీజును మాత్రమే తీసుకోవాలని డీసీజీఐ తెలిపింది. అత్యంత విలువైన రక్తాన్ని ఉచితంగా అందించాలన్నదే మనందరి లక్ష్యమని తెలిపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బ్లడ్, బ్లడ్ కాంపోనెంట్స్కు రూ.250 నుంచి రూ.1,550 వరకు ప్రాసెసింగ్ ఫీజు సరిపోతుందని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను పంపింది.