TG: రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతుల కల నెరవేరింది. ఇందుకోసం గత 20 ఏళ్లుగా ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియకు అడ్డుగా మారిన చట్టపరమైన వివాదాలను సీఎం రేవంత్రెడ్డి పరిష్కరించడంతో 18,942మందికి మేలు జరిగింది. విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉండడంతో దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. వివాదాలకు తావులేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్ 1, 2 పరిధిలోని ఉపాధ్యాయులకు మేలు జరిగింది.