కాంగ్రెస్ ఎంపీ ఇంటి ముందు ఆందోళన (వీడియో)

550చూసినవారు
దక్షిణ భారత్‌లోని రాష్ట్రాలను కలిపి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారి తీశాయి. బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఈ మేరకు ఆదివారం బెంగళూరులోని డీకే సురేశ్ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. డీకే సురేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్