మహారాష్ట్రలోని పుణే కారు ప్రమాదం కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత వెళ్లిన బార్లో నిందితుడు కేవలం 90 నిమిషాల్లోనే రూ.48వేల ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. మరోవైపు ఆ టీనేజర్కు డ్రైవింగ్ లైసెన్సుపై నిషేధం విధించారు. అతడికి 25 ఏళ్లు వచ్చేంతవరకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వమని పోలీసులు చెప్పారు.