మలేషియా మాస్టర్స్ మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో ఆమె తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి వాంగ్ జై చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది. ప్రస్తుతం భీకర ఫామ్లో ఉన్న ఆమెకు భంగపాటు తప్పలేదు. తొలి సెట్లో ప్రత్యర్థిపై ఆమె ఆధిపత్యం చెలాయించింది. తర్వాత రెండు సెట్లలో ఓడిపోవడంతో మ్యాచ్ చేజారిపోయింది.