భారత అండర్-19 జట్టుకు తొలిసారి ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్

69చూసినవారు
భారత అండర్-19 జట్టుకు తొలిసారి ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్
ఇండియాలో ఆస్ట్రేలియాతో జరిగే మల్టీ-ఫార్మాట్ సిరీస్ కోసం భారత అండర్-19 జట్టులోకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తొలిసారిగా ఎంపికయ్యాడు. 18 ఏళ్ల సమిత్ ఇటీవల మహారాజా టీ20 టోర్నమెంట్లో మైసూరు వారియర్స్ తరఫున ఆడుతూ, భారీ సిక్సర్ కొట్టి వార్తల్లో నిలిచాడు. కాగా, సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్లో 3 వన్డేలు, నాలుగు రోజుల 2 టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్