జనజాతర పెరిట తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. సభాస్థలికి చేరుకున్న ఆయనను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సాధరంగా స్టేజీపైకి ఆహ్వానించారు. సభలో జాతియ మేనిఫెస్టోని రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఈ మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించి 23 అంశాలు ఉండనున్నాయి. కాగా, సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.