వైసీపీలో చేరిన జ‌న‌సేన నేత రాజాబాబు

107846చూసినవారు
వైసీపీలో చేరిన జ‌న‌సేన నేత రాజాబాబు
అమలాపురం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీ గూటికి చేరారు. ఆయ‌న‌కు సీఎం జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజాబాబుతో పాటు జ‌న‌సేన ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు ఎం. శ్రీనివాస్, కొవ్వూరు వీరమహిళా విభాగం నేత చెట్టి సుభాషిణి కూడా వైసీపీలో చేరారు. కాగా, పొత్తుల్లో భాగంగా అమలాపురం అసెంబ్లీ టికెట్‌ను టీడీపీకి ఇచ్చారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాబాబు జ‌న‌సేన‌కు గుడ్‌బై చెప్పారు.

సంబంధిత పోస్ట్