పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కంచనజంగ రైలు ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవడం చాలా బాధించిందని తెలిపారు. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని కాంక్షించారు. ప్రభుత్వం వెంటనే వారికి ప్రకటించిన మొత్తం ఎక్స్గ్రేషియాను ఇవ్వాలని డిమాండ్ చేశారు.