కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకొని తర్వాత వరంగల్ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే తాజాగా ఆ పర్యటన రద్దు అయినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల కారణంగా రాహుల్గాంధీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.