దేశీయ ఫార్మా ఎగుమతులు 2030 నాటికి 65 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటాయని బెయిన్ అండ్ కంపెనీ నివేదిక వెల్లడించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా ఎగుమతుల్లో తొలి ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలువనుందని పేర్కొంది. ప్రపంచంలో అమ్ముడవుతున్న అయిదు జనరిక్ ఔషధాల్లో ఒకటి భారత్కు చెందినది అయినప్పటికీ ఎగుమతుల విలువ పరంగా చూస్తే 11వ స్థానంలో ఉందని తెలిపింది.