ఇటీవల మార్కెట్లో రూ.200, రూ.500 నకిలీ నోట్లు గణనీయంగా పెరిగాయని ఫిర్యాదులు వస్తుండంటంతో ఆర్బీఐ రూ.200 నోట్లను రద్దు చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. రూ.200 నోట్లను బ్యాన్ చేయబోతున్నట్లుగా వస్తోన్న వార్తలను ఖండించింది. ప్రస్తుతానికి రూ. 200 నోట్లను రద్దు చేసే నిర్ణయం లేదని స్పష్టం చేసింది.